ద్విచక్ర ప్రియులకు గుడ్ న్యూస్..

ద్విచక్ర ప్రియులు ఎంతగానో ఇష్టపడే హార్లీ డేవిడ్‌సన్‌ నుండి త్వరలో చిన్న బైక్ లు భారత్ లోకి రాబోతున్నాయి. ఇప్పటివరకు భారీ ఖరీదు గల బైక్ లను అందించే ఈ సంస్థ, ఇక ఫై చిన్న బైక్ లను విడుదల చేసి భారత్ లో తమ పట్టు పెంచుకునేందుకు ఈ ప్రయత్నామ్ చేస్తుంది.

200 నుంచి 500సీసీ కేటగిరీలో ద్విచక్ర వాహనాలను అందించే యోచనలో ఉన్నట్లు ఇన్వెస్టర్‌ కమ్యూనికేషన్‌లో హార్లీ డేవిడ్‌సన్‌ తెలియజేసింది. వచ్చే రెండేళ్లలో ఈ బైక్‌లను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఇతర ఆసియా దేశాలలో కూడా బైక్‌లను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.