వినియోగదారులకు షాకింగ్ విషయాన్నీ తెలియజేసింది ప్రముఖ వాహన సంస్థ హ్యుందాయ్. హ్యుందాయ్ నుండి వచ్చిన హ్యాచ్బ్యాక్ గ్రాండ్ ఐ10 వినియోగదారులను ఎంతగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా దీని ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి 3 శాతం వరకు (రూ.14,250–రూ.22,500) పెంచనున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం ఈ కారు ధరల శ్రేణి రూ.4.74 – 7.51 మధ్య ఉందని కంపెనీ సీఈఓ వైకే కూ తెలిపారు. అయితే మిగిలిన మోడల్ కార్ల ధరలేవీ పెరగలేదు. మరో వైపు ఈ ఏడాది దీపావళికి కొత్త కాంపాక్ట్ మోడల్ను తీసుకురానున్న తరుణంలో గ్రాండ్ ఐ10 ధరను పెంచడం జరిగినట్లు తెలుస్తుంది. ఈ పెంపుకు ప్రధాన కారణం ముడివస్తువుల ధరలు పెరగడం వల్లే అని సంస్థ చెపుతుంది. ఈ మోడల్ కారు మినహాయించి కంపెనీకి చెందిన ఇతర కార్ల ధరలు ఏవీ కూడా పెరగడం లేదని స్పష్టం చేసింది.
ఐ10 ఫీచర్స్ విషయానికి వస్తే
*1.2 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో లభిస్తోంది.
* ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్
* కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఎయిర్ కర్టయిన్స్
* పూర్తి ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్
* వెనుకవైపునకు వ్యాపించేలా ఏసీ వంటివే కాకుండా మరెన్నో ఫీచర్లు కొత్త గ్రాండ్ ఐ10లో ఉన్నాయి.