దసరా , దీపావళి పండగలు దగ్గరకు వస్తుండడం తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు అన్ని సంస్థలు తమ ఆఫర్లను , కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ తన స్యూవీ ఏఎంజీ జీ 63లో కొత్త వెర్షన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.2.19 కోట్లు (ఎక్స్- షోరూమ్ దిల్లీ) గా సంస్థ నిర్ణయించింది.
ఈ కార్ ప్రత్యేకతలు చూస్తే..
* 4- లీటర్ వీ8 బైటర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉండడమే కాదు 585 హార్స్పవర్ శక్తిని కలిగి ఉంది.
* అలాగే ఈ కార్ గంటకు 0- 100 కి.మీ వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకోగలదట.
* దీని గరిష్ఠ వేగం గంటకు 220 కి.మీ.
* అత్యాధునిక స్టైల్ తో పాటు హైటెక్ క్యాబిన్లు, , స్పోర్ట్స్ కారు తరహా పనితీరు వంటివి ఈ కార్ ప్రత్యేకతలుగా చెపుతున్నారు.