పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా ‘డెస్టినీ’ విడుదల

ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా భారత మార్కెట్లోకి ‘డెస్టినీ’ విడుదల చేసింది. ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా ఈ స్కూటర్‌ను విడుదల చేయడం విశేషం. 125 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ స్కూటర్ రెండు రకాల్లో లభించనుంది.

వీటిలో ఎల్‌ఎక్స్ మోడల్ కాగా.. మరోటి వీఎక్స్ మోడల్. ఇక ఈ రెండు సూక్టర్ల ధరలు చూస్తే రూ.56,250, రూ.59,500 గా ఉన్నాయి.

వీటి ప్రత్యేకతలు విషయానికి వస్తే..

* ‘ఐ3ఎస్’ టెక్నాలజీతో వీటిని రూపొందించారు. దీని ద్వారా అధిక ట్రాఫిక్ సమయంలో దానంతటదే ఆగిపోతుంది. దీంతో పది శాతం వరకు ఇంధనం ఆదా అవుతుందట.

* సైడ్ స్టాండ్‌ను అలాగేవుంచి వాహనాలు నడుపుతూ ప్రమాదాలబారిన పడుతున్న వారికి ప్రయోజనం కల్గించే విధంగా అలర్ట్ హారన్ వచ్చే విధంగా దీంట్లో నూతన టెక్నాలజీని పొందుపరిచినట్లు సంస్థ తెలిపింది. వీటితో పాటు మరెన్నో ప్రత్యేకట్లు ఉన్నట్లు సంస్థ చెపుతుంది.