ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో..ఇటీవల సరికొత్త సెడాన్ కారు ను విడుదల చేసిన సంగతి తెల్సిందే . పోలెస్టార్ ఇంజినీర్డ్ వెర్షన్తో వచ్చిన ఈ కార్లు కేవలం 20 యూనిట్లు మాత్రమే తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. లిమిటెడ్గా తీసుకొచ్చిన మొత్తం 20 యూనిట్లు కేవలం 30 నిమిషాల్లో బుక్ అయ్యి సరికొత్త రికార్డు సృష్టించాయి.
అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కారు ప్రీ బుకింగ్లను వోల్వో యాప్ ద్వారా శుక్రవారం ప్రారంభించారు. దీని ధర రూ. 45.04 లక్షలు(ఆన్ రోడ్, న్యూఢిల్లీ) గా తేల్చారు. బుక్ చేసుకున్న కస్టమర్లకు 2019లో ఈ కారును డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ కార్ ఫీచర్లు చూస్తే..
* 415 హార్స్పవర్
* 669ఎన్ఎం టార్క్
* ఓలిన్స్ సస్పెన్షన్
* బ్రెంబో బ్రేక్స్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.