వాహన ప్రియులకు గుడ్ న్యూస్..వేగనార్ నుండి సరికొత్త మోడల్ రాబోతుంది. జనవరి 23 నుంచి భారత మార్కెట్లోకి ఈ వాహనం అందుబాటులో ఉండబోతుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఈ కార్ విషయానికి వస్తే.. డ్యాష్బోర్డును పూర్తిగా చేంజ్ చేసి, స్మార్ట్ టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ను అమర్చినట్లు తెలుస్తుంది. అలాగే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ కార్ రంగులు చూస్తే.. నలుపు, బూడిద రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించబోతున్నాయి.
వీటితో పాటు సరికొత్త ఏసీ ఎయిర్ కండీషన్ వెంట్, స్టీరింగ్లో సైతం ఆడియో, టెలిఫోన్ కంట్రోల్స్ను ఉండేలా తయారుచేసారు. మొత్తం మీద ఈ వేగనార్ కార్ అందరికి నచ్చే కార్ అవుతుందని సంస్థ చెపుతుంది.