తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా నిన్నటితో 58 రోజులు పూర్తి చేసుకుంది. గత 57 రోజులుగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ షో , 58 వ రోజు మాత్రం తీవ్ర నిరాశ పరిచింది. షో మొదలైనప్పటినుండి చివరి వరకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. తరతరాలుగా యుగయుగాలుగా పురుషులకి, మహిళలకి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌజ్లో పురుషులని, మహిళలని రెండు టీంలుగా విభజించి అంతిమ యుద్ధం అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ఇక టాస్క్ మొదలైనప్పటి నుండి చివరి వరకు కూడా లొల్లి లొల్లి గా సాగి , ప్రేక్షకులను బోర్ కొట్టించింది. టాస్క్ లో భాగంగా కాయిన్స్ కోసం మహిళా టీం ఎంతో శ్రమించింది..గీత , శ్యామల , పూజా , దీప్తి ఎంతో కష్టపడుతుంటే సునయన మాత్రం నాకు ఈ గేమ్ కు సంబంధం లేదన్నట్లు వ్యవహరించింది. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ ఆమె మాత్రం ఏం మాట్లాడకుండా , సైలెంట్ గా అరటిపండ్లు తినుకుంటు ఉండిపోయింది. మధ్య మధ్యలో తనీష్ తో రొమాన్స్ చేస్తూ టైం పాస్ చేసింది తప్ప సీరియస్ గా గేమ్ ఆడలేదు. ఈ షో చూస్తున్న ప్రేక్షకులకు అసలు సునయన బిగ్ బాస్ లో అవసరమా అని మాట్లాడుకున్నారు.