‘బిగ్ బాస్’ ఆడవారి బాత్రూమ్‌లోకి కౌశల్.. పూజా షాక్

నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజయవంతంగా 60 రోజులు పూర్తి చేసుకుంది. గత రెండు రోజులుగా ఆడవాళ్లకు, మగవాళ్లకు మధ్య జరుగుతున్న ‘అంతిమ యుద్ధం’ టాస్క్ ముగిసింది. ఈ అంతిమ యుద్ధం టాస్క్ లో మహిళలపై పురుషులు పైచేయి సాధించారు. వాస్తవానికి ఈ ‘అంతిమ యుద్ధం’ టాస్క్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. ఈ టాస్క్ ఎందుకు పెట్టారో కూడా తెలియని విధంగా ఉంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే..నిత్యం హౌస్ లో హాట్ టాపిక్ గా నిలిచే కౌశల్ ఫై మరో ఆరోపణ ఎదురయ్యింది.

హౌస్‌లో ఇన్ని బాత్ రూంలు ఉన్నా కౌశల్ మాత్రం మహిళల బాత్ రూంలే వాడుతున్నాడంటూ గీతా మాధురికి పూజా కంప్లైంట్ చేసింది. మగవారు కి సెపరేట్‌గా మహిళలకు సెపరేట్‌గా బాత్ రూమ్‌లు ఉన్నా అతడు లేడీస్ బాత్‌ రూమ్స్ వాడటం ఏంటని ఇది నాకు నచ్చలేదన్నది పూజా. దీనిపై రియాక్ట్ అయిన గీతా మాధురి ఈ విషయంలో నవ్వాలో ఏడవాలో తెలియడం లేదంటూ గతంలో తేజస్విని కూడా ఇదే కంప్లైంట్‌ చేసిందని.. ఇది తొలిసారి కాదంటూ కౌశల్‌పై అడిగే ప్రయత్నం చేసింది గీతా మాధురి. అయితే కౌశల్ నుండి సరైన స్పందన లేకపోవడంతో మధ్యలోనే వెనుతిరిగింది గీతా. మరి ఈ వ్యవహారం ఫై నాని ఏమంటాడో శనివారం ఎపిసోడ్ లో చూడాలి.