త్వరలో ఏపీలో 25 నోటిఫికేషన్లు


రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెలాఖరుకు 25 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. . గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల నోటిఫికేషన్లతో పాటు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు.

కాగా గ్రూపు-1 పరీక్షల నిర్వహణలో మార్పులపై అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష కింద ఒక పరీక్షనే నిర్వహించేవారు. కమిషన్‌ ప్రతిపాదించిన మేరకు ఖరారు చేసిన కొత్త విధానంలో పేపరు-1, పేపరు-2 కింద రెండు పరీక్షలను రెండు గంటల చొప్పున నిర్వహిస్తారు. ఒక్కొక్క పరీక్ష 120 ప్రశ్నలతో 120 మార్కులకు (మొత్తం 240) ఉంటుంది. మెయిన్స్‌లో ఆంగ్లం అర్హత పరీక్షగా ఉండేది. దీంతోపాటు తెలుగును ప్రత్యేకంగా నిర్వహిస్తూ అర్హతను తప్పనిసరి చేశారు .