ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్..ఒక్కో పోస్ట్ కు ఎంత మంది పోటీ పడుతున్నారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటినుండి ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడం తో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 7729 పోస్టులకు గాను.. ఇప్పటి వరకు 5,33,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈనెల1 నుంచి ఆన్ లైన్‌లో అప్లికేషన్లు మొదలవ్వగా , నవంబర్ 15వ తేదీ నాటికి 5.33లక్షల మంది ప్రాథమిక వివరాలు తెలిపి ఫీజులు చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ లెక్కన ప్రకారం సగటున ఒక్కో పోస్టుకు 69 మంది పోటీ పడుతున్నారు.

ఓసీ అభ్యర్థులకు 42 నుంచి 44 సంవత్సరాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47 నుంచి 49, దివ్యాంగులకు 52 నుంచి 54 సంవత్సరాలకు వయోపరిమితిని పెంచడం జరిగింది. దీంతో చాలా మంది అభ్యర్థులు చివరిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆన్ లైన్లో అప్లై చేయడానికి ఈనెల 18 వరకు గడువు ఉంది. ఈ మూడు రోజుల్లో కూడా మరింత మంది దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది.