ఆర్‌ఆర్‌బీ లో భారీగా కొలువులు…

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) లో భారీగా కొలువులు ప్రకటించారు..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 64,371 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసారు. ఈ గ్రూప్ లోని అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఉద్యోగాలతో పాటు ఇతర టెక్నికల్ పోస్టులకు భారీ ఎత్తున ఖాళీలు ప్రకటించింది.

* ఎఎల్పీ పోస్టులు 27,795 ఉండగా , టక్నీషియన్ పోస్టులు 36,576 ఉన్నట్లు తెలిపింది. ఈ రెండు పోస్టులను బట్టి మొత్తం 64,371 ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తులు రేపట్నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంటాయని, అక్టోబర్ 1కి క్లోజ్ అవుతాయని తెలిపింది. ఎంపికైన ఉద్యోగులకు రూ. 19,900 కనీస వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. ప్రశ్నపత్రాలు హిందీ, ఇంగ్లిష్ తో కలిపి మొత్తం 15 భాషల్లో ఉంటాయి. పూర్తి డీటెయిల్స్ ఈ నోటీసు లో చూడవచ్చు.