విద్యాసంస్థలకు వరుస సెలవులు..

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. డిసెంబర్ 6,7న ప్రభుత్వం సెలవులు ప్రకటించగా , ఈ సెలవులు ముగియడంతో రెండో శనివారం, ఆదివారం రానుండటంతో వరుసగా నాలుగురోజులు సెలవులు వచ్చాయి. ఈనెల 7న జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.

ఓట్ల కౌంటింగ్ రోజైన మంగళవారం నాడు కూడా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. మొత్తం మీద ఎన్నికల మూలాన సెలవులు కలిసిరావడం తో అంత సొంత ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. ఉదయం నుండి అన్ని బస్టాండ్ లు , రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. ఓపక్క వరుస సెలవులు రావడం , మరోపక్క తమ ఓటు వినియోగించుకునేందుకు అంత సొంత ఊర్లకు ప్రయాణం సాగిస్తున్నారు.