అభ్యర్థులకు తీపి కబురు తెలిపిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్..

జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్, సబ్‌ఎడిటర్ , జూనియర్ ఫిజియో థెరపిస్ట్ తదితర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తీపి కబురు తెలిపింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దాదాపు 1136 సెలక్షన్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు గడువును అక్టోబరు 12 వరకు పెచుతున్నట్లు తెలిపింది.

ఇప్పటివరకుదరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఎవరైనా ఉంటె ఈ నెల 12న సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపింది. అలాగే దరఖాస్తు ఫీజును అక్టోబరు 15లోపు చెల్లించవచ్చు. అలాగే పరీక్ష షెడ్యూల్ కూడా మార్చడం జరిగింది. కాకపోతే ఆ పరీక్షలు ఎప్పుడు మొదలవుతాయి మాత్రం ఇంకా తెలుపలేదు.