అతి త్వరలో తెలంగాణ లో గ్రూప్ -1 నోటిఫికేషన్..

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -1 ఉద్యోగాల కోసం సిద్ధం అవుతున్న అభ్యర్థులకు తీపి కబురు తెలిపింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అతి త్వరలో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ వాణి ప్రసాద్ తెలిపారు.

ఆయన ఈరోజు మీడియా తో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 38 వేల 59 పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. 101 నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటి వరకు 16 వేల 50 పోస్టులను భర్తీ చేశాం. 20 వేల 260 పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ కారణాల వల్ల 1877 పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ఇప్పటి వరకు టీఎస్ నిర్వహించిన అన్ని పరీక్షలకు 34 లక్షల మంది హాజరయ్యారు. టీఆర్టీ(టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్)కి సంబంధించి ప్రాసెస్ కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రకటన తో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.