ఓటేసిన వారికీ థాంక్స్..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో ఓటమి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమకు ఓటేసిన వారికీ థాంక్స్ చెప్పుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో ఒక్కడే అంత తిరిగి…ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సుడిగాలి పర్యటనలు చేసిన పవన్ కళ్యాణ్..ఫలితాల అనంతరం హైదరాబాద్ కు వెళ్లారు. కాస్త అనారోగ్యం పాలవడంతో కొన్ని రోజుల పాటు ఎవరిని కలవలేకపోయాడు.

తాజాగా మంగళగిరి లో తన అన్న నాగబాబు తో కలిసి నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీ లో ముందుగా తమ పార్టీ కి ఓట్ వేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల పట్ల చర్చలు జరిపారు. పార్టీ ఎందుకు ఓడిపోయింది..ఎందుకు ప్రజల్లోకి వెళ్ల లేకపోయాం..రాబోయే రోజుల్లో ఏం చేద్దాం..ప్రజల మధ్య కు ఏ విధిగా వెళదాం అనే అంశాల గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.