పవన్ కు ఇదే మంచి సమయం..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి చెందామని బాధపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి సమయం వచ్చిందా..అంటే వచ్చిందనే చెప్పాలి. నిన్నటి వరకు ప్రత్యామ్న్యా పార్టీ గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కనుమరుగయే పరిస్థితి వచ్చింది. పార్టీ లో ఉన్న నేతలంతా వేరే పార్టీ లోకి జంప్ అవుతుంటే..అధినేత చంద్రబాబు సైతం ఏం చేయలేక విదేశాల్లో గడపాల్సిన వస్తుంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్న్యా పార్టీ గా జనసేన అవుతే ప్రజల్లో ఎంతో గుర్తింపు వస్తుంది.

ప్రజల్లో మీము ఉన్నాం..అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపిస్తాం..ప్రజల కష్టాల్లో ఉంటె మీము నిలబడతామని వారికీ భరోసా కల్పిస్తే జనసేన పార్టీ కి ప్రజల మద్దతు ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ కి గుర్తింపు వస్తుంది..ప్రజల్లో ఓ నమ్మకం కల్పించినవారు అవుతారు. అందుకే పవన్ ఇక నుండి చాల జాగ్రత్త గా ఉంటూ ప్రజల్లోకి పార్టీ ని తీసుకెళ్తే ఎంతో బాగుంటుంది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.