అనుపమ ఐరన్ లెగ్..?

‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన భామ అనుపమ పరమేశ్వరన్. ఆ చిత్రంతో ఆమె ఎంతోమంది కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిన మాట వాస్తవం. ఎక్స్‌పోజింగ్ జోలికి వెళ్లకుండానే ఆమె కుర్రాళ్లను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆ సినిమా తర్వాత అ ఆ , శతమానం భవతి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత అమ్మడికి తెలుగు , తమిళ్ భాషల్లో అవకాశాలు తలుపు తట్టాయి.

తెలుగు లో 2017 లో ఉన్నది ఒకటే జిందగీ చిత్రం అమ్మడికి నిరాశ పరిచింది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని సరసన కృష్ణార్జున యుద్ధం సినిమాలో జోడి కట్టింది. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. అప్పటివరకు వరకు విజయాల బాటలో ఉన్న నానికి పెద్ద షాకే ఇచ్చింది. అనుపమ నటించిన రెండు సినిమాలు ప్లాప్ కావడం తో ఈమెపై కాస్త నెగిటివ్ కామెంట్స్ ఆ మధ్య వినిపించాయి. తాజాగా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సరసన తేజ్ సినిమా లో నటించింది. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్సెడ్ టాక్ సొంతం చేసుకుంది. కొంతమంది సినిమాకు మిక్సెడ్ టాక్ చెపుతుంటే మరికొంతమంది మాత్రం సినిమాను ప్లాప్ అంటున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం తమ హీరో సినిమా ప్లాప్ కావడానికి హీరోయిన్ అనుపమే కారణమని చెపుతున్నారు. ఇటీవల ఆమె నటించిన ఏ సినిమా కూడా హిట్ కాలేదని , ఆమె లెగ్ మాములు లెగ్ కాదని అంటున్నారు.

దీనిపై మరికొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కథలో దమ్ముండాలి కానీ హీరోయిన్ తో సంబంధం ఏముంటుంది. అలైతే తమన్నా ఐరెన్ లెగ్ అనే సంగతి సినిమా ఇండస్ట్రీ లో అందరికి తెలుసు అయినాగానీ రాజమౌళి బాహుబలి చిత్రం లో పెట్టుకోలేదా..ఆ సినిమా ఏమైనా ప్లాప్ అయ్యిందా..కథ బాగుంటే హీరోయిన్ తో సంబంధం లేకుండా సినిమా హిట్ అవుతుంది..అంతే కానీ హీరోయిన్ ను సినిమా ప్లాప్ లోకి లాగకూడదని అంటున్నారు. ప్రస్తుతం అనుపమ చేతిలో హలో గురు ప్రేమకోసమే అనే సినిమా ఉంది.

దిల్ రాజు బ్యానర్ లో త్రినాధ్ నక్కిన డైరెక్ట్ చేస్తున్నాడు.