ప్రభాస్ అక్కడ సక్సెస్..చిరు ఇక్కడ సక్సెస్

ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ మూవీస్ గా విడుదలైన చిత్రాలు సాహో, సైరా. ఈ రెండు చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదల అయ్యాయి. కాగా సాహో విషయానికి వస్తే బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సినిమా కావడం..భారీ బడ్జెట్ , భారీ యాక్షన్ తో తెరకెక్కడం తో అన్ని భాషల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ హిందీ లో తప్ప ఎక్కడ కూడా వసూళ్లు రాబట్టలేకపోయింది. అలాగే ముందు నుండి కూడా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో విపరీతంగా ప్రమోషన్ చేశారు. దీంతో బాలీవుడ్ లో భారీ వసూళ్లు రాబట్టింది. మిగతా అన్ని చోట్ల నష్టాలే తెచ్చింది.

ఇక సైరా విషయానికి వస్తే ఎక్కడ కూడా పెద్దగా ప్రమోషన్ చేయలేదు. సినిమా రిలీజ్ డేట్ వరకు కూడా సినిమా పనులు కావడం వల్ల చివరి నిమిషంలో ఏదో తూతూ మాత్రంగా ప్రమోషన్ చేసారు. దీంతో తెలుగులో తప్ప మిగతా అన్ని చోట్ల యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ కారణంగా తెలుగులో మినహా అన్ని చోట్ల నామమాత్రపు కలెక్షన్లు రాబట్టగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రూ. 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. సో సాహో బాలీవుడ్ లో క్లిక్ అయితే..సైరా మాత్రం తెలుగు లో క్లిక్ అయ్యింది.