తమన్ భయ్యా పాసైపోయాడు

జూ.ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’.. పూజా హెగ్డే కథానాయిక. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని లిరికల్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

‘‘అరవింద సమేత’లో ప్రత్యేక లిరికల్‌ వీడియో ‘అనగనగనగా’ శనివారం సాయంత్రం 4.05గంటలకు విడుదల చేయబోతున్నాం’’ అని హారిక హాసిని క్రియేషన్స్‌ వెల్లడించింది. చెప్పినట్లే అదే టైంకి వీడియోని రిలీజ్ చేశారు. చీకటిలాంటి పగటి పూట.. కత్తుల్లాంటి పూలతోట.. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటారా?’’ అంటూ సాగిన గీతాన్ని అమన్‌ మాలిక్‌ ఆలపించారు.

కాగా ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. త్రివిక్రమ్ తమన్ కలసి పనిచేయడం ఇదే మొదటి సారి. దీంతో ఈ కాంబినేషన్ ఎలా వుటుందో అనే ఒక ఆసక్తివుండేది. అయితే మొదటి పాట చాలా బావుంది. ఈ పాటకు పాస్ మార్కులు పడిపోయాయి. ఈ పాటతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి.

ఇక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో తారక్‌ సంభాషణలు చెప్పబోతున్నారు. తెరపై మరోసారి సిక్స్‌ ప్యాక్‌తో సందడి చేయబోతున్నారు. ఇందుకోసం ఆయన చాలా రోజుల పాటు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేసిన విషయం తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.