అర్జున్ రెడ్డి ముందు వరకు కూడా నైజాం మెగాస్టార్ గా నితిన్ ను పిలుచుకునేవారు..కానీ అర్జున్ రెడ్డి విడుదల తర్వాత తెలంగాణ యూత్ అంత నైజాం మెగాస్టార్ అంటే విజయ్ దేవరకొండనే అంటున్నారు. అర్జున్ రెడ్డి తో యూత్ లో విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో నితిన్ ఫాన్స్ వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ మొదలు అయ్యింది.
ప్రస్తుతం నితిన్ శ్రీనివాస కళ్యాణం , విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాల తాలూకా టీజర్లు ఒకరోజు తేడా తో విడుదలై యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఆదివారం శ్రీనివాస కళ్యాణం టీజర్ రిలీజైంది. ఈ టీజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే 10లక్షల వ్యూస్ దక్కించుకుంది. సోమవారం రిలీజైన విజయ్ దేవరకొండ `గీత గోవిందం` టీజర్ జెట్స్పీడ్తో యూట్యూబ్లో దూసుకెళ్లింది. ఈ టీజర్ని కేవలం 18 గంటల్లోనే 28లక్షల మంది వీక్షించడం విశేషం.
ఇక సోషల్ మీడియా లో అయితే ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పెద్ద వార్ మొదలయింది. ఏ హీరోకి ఎంత క్రేజు ఉంది అన్నది డిసైడ్ చేస్తోంది ఇవే అన్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు. యూట్యూబ్ వ్యూస్ని బట్టి నైజాం మెగాస్టార్ ఎవరో తేలిపోనుందని చర్చించుకుంటున్నారు. ఆగస్టు 9న నితిన్ శ్రీనివాస కళ్యాణం రిలీజ్ అవుతుండగా , సరిగ్గా వారం గ్యాప్తో ఆగస్టు 15న దేవరకొండ `గీత గోవిందం` సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.