కొరియోగ్రాఫర్‌గా మారబోతున్న సాయి పల్లవి..?

సాయి పల్లవి కేవలం నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా…అనేక డాన్స్ షోలలో పాల్గొని తన సత్తా చాటుకుంది. ఇక ఇప్పుడు కొరియోగ్రాఫర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న లవ్‌ స్టోరీలో సాయి పల్లవి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి మరో రెండు వారాల షూటింగ్‌ పెండింగ్‌లో ఉందట.

ఇందులో ఓ పాట కూడా ఉందట. ఈ మొత్తాన్ని త్వరలోనే పూర్తి చేయాలనుకుంటున్న దర్శకుడు అందుకు సంబంధించిన పనులను ప్రారంభించేశారట. ఈ క్రమంలో ఈ మూవీలో మిగిలి ఉన్న ఒక్క పాటకు కొరియోగ్రఫీ చేయమని శేఖర్ కమ్ముల, సాయి పల్లవిని అడిగారట. అందుకు మలార్ బ్యూటీ హ్యాపీగా ఒప్పేసుకుందట. ఈ క్రమంలో ఈ పాటకు కంపోజ్ చేయడంతో పాటు అందులో సాయి పల్లవి కనిపించనుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.