పాపం .. రష్మికని బాగా ఇబ్బంది పెడుతున్నారు


కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత రక్షిత్ శెట్టి, కథానాయిక రష్మిక మందనల నిశ్చితార్థం రద్దయింది. రష్మిక మందన నిశ్చితార్థం రద్దయినట్లు ఆమె తల్లి సుమన్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఐతే ఈ విషయంలో రష్మికను టార్గెట్ చేస్తున్నారు రక్షిత్ అభిమానులు. ఆమెను టార్గెట్ చేస్తూ ఎన్నో కథలు, వార్తలు, కామెంట్లు, ట్రోల్స్‌ చేస్తున్నారు. దీనిపై ఆమె తాజాగా ఓ పోస్ట్ పెట్టింది.

ఇంతకాలం నా వ్యక్తిగత విషయాల్లో నేను మౌనం వహించినందుకు నన్ను క్షమించండి. నా గురించి ఎన్నో కథలు, వార్తలు, కామెంట్లు, ట్రోల్స్‌ వస్తున్నాయి. అవన్నీ నన్ను తప్పుగా చూపిస్తుండడంతో నేను డిస్టర్బ్‌ అవుతున్నాను. ఈ విషయాలన్నీ చాలా దూరం వెళ్లిపోయాయి. ఇందుకు మిమ్మల్ని వేలెత్తి చూపాలనుకోవడంలేదు. ఎందుకంటే మీరు అలాంటివే నమ్ముతారు. ఈ వార్తల గురించి మీ అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. రక్షిత్‌, నేనే కాదు..సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరూ మాలాగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదు. దయచేసి మా పనిని ప్రశాంతంగా చేసుకోనివ్వండి” అని కోరింది రష్మిక.