మహేష్, చిరు చెరో కోటి.. ఎన్టీఆర్ యాబై లక్షలు

భారీ వర్షాల కారణంగా హైదరాబాదులోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 32 వేలకు పైగా కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని నిన్న మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నగరానికి జరిగిన పూర్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంది.

 మరోవైపు, వరద బాధితులను ఆదుకోవడానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణకు ఆర్థికసాయం ప్రకటిస్తున్నాయి. మరోవైపు మేము సైతం అంటూ సినీ ప్రముఖులు కూడా ఆపన్నులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. మహేష్ బాబు, చిరంజీవి చెరో కోటి , ఎన్టీఆర్ యాబై లక్షలు ఇచ్చారు. ఇక  నాగార్జున రూ. 50 లక్షలు ఇస్తున్నాను అని ప్రకటించారు.

విజయ్ దేవరకొండ   సీఎం రీలీఫ్ ఫండ్ కు రూ. 10 లక్షలు ఇస్తున్నానని తెలిపాడు. మరోవైపు దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ కూడా బాధితులకు అండగా తాము కూడా ఉన్నామన్నారు. చెరొక రూ. 5 లక్షల వంతున సీఎం రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించారు.