మూడేళ్ల తర్వాత మహేష్ ఆ పని చేసాడు..

సాధారణంగా సోషల్ మీడియా పేజీ లలో తరుచు డీపీ లను మారుస్తుంటారు. అయితే మహేష్ మాత్రం మూడేళ్లు గా తన డీపీని అలాగే ఉంచాడు. మరి అది సెంటిమెంట్ గా భావించాడో ..ఏంటో తెలియదు కానీ మూడేళ్లు గా అది ఉంచాడు. తాజాగా ఇప్పుడు తన డీపీ ని మార్చాడు.  తన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డీపీని మార్చేశాడు.

ఇటీవల పాల్గొన్న నైక్‌ కంపెనీ షోటోషూట్‌లో పాల్గొన్న పిక్‌ను తన డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టుకున్నాడు. దీంతో పాటు కవర్‌పేజ్‌, హెడర్‌గా కూడా బ్లూ టీషర్ట్‌ వేసుకుని క్లీన్‌ షేవ్‌తో మ్యాన్లీగా కనిపిస్తున్న ఓ ఫోటోను అప్‌డేట్‌ చేశాడు. ఇటీవలే ట్విట్టర్‌లో 10 మిలియన్స్‌ ఫాలో అవర్స్‌ను సాధించిన స్టార్‌గా ఘనత సాధించాడు. ఈ సందర్బంగా మార్చాడు కావొచ్చు. ఇక సినిమా విషయాలకు వస్తే..ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు.