ఝుమ్మంది నాదం చిత్రం తో తెలుగు తెరకు పరిచమైన సొట్టబుగ్గల భామ తాప్సి..ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ నటిగా మారింది. తాజాగా, ‘సాంఢ్ కీ ఆంఖ్’ మూవీ కోసం పరిశీలించిన తన ఫస్ట్ ట్రయల్ లుక్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తన సినీ కెరీర్లో ఇదే అతిపెద్ద ప్రయోగం అని చెప్ప్పుకొచ్చింది. ఈ మూవీ లో ఈమె ఓ వృద్ధురాలిగా కనిపించింది. ఈ క్రమంలోనే తన అనుభవాలను అందరితో పంచుకుంది.
“నా కెరీర్లోనే ఇది అతిపెద్ద ప్రయోగం. మొదటిసారి డైరెక్టర్గా తుషార్ హీరానందాని, తొలిసారి నిర్మాతగా నిధి పార్మర్హిరా, ఇక కెరీర్లోనే మొదటిసారి ఇద్దరు నటీమణులు తమ వయసుకు మించిన పాత్రల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఎంతో మంది ఫస్ట్ టైమ్ సినిమా కోసం వర్క్ చేసిన వ్యక్తులు ఉన్నారు. నాకు తెలిసి ఇది స్టార్టర్స్ అదృష్టం అనుకుంటా. ‘సాంఢ్ కీ ఆంఖ్’తో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి.”అని తెలిపింది.