2.ఓ టాక్…చెప్పింది గోరంత..చూపించింది కొండంత

వచ్చాడయ్యో చిట్టి..ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామే..అంటున్నారు అభిమానులు..గత రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 2.ఓ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైయ్యింది. భారత సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రానికి రూ.500 కోట్ల ఫై చిలుకే ఖర్చు చేసారు. ఇంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఇప్పటికే ట్రైలర్ లో చూసాం..కానీ ట్రైలర్ లో చూసింది గోరంత..తెరపై చూపించింది కొండంత. అవును సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా గురించి, శంకర్ డైరెక్షన్ గురించి, చిట్టి బాబు, అక్షయ్ ఎంట్రీల గురించి ముఖ్యంగా గ్రాఫిక్స్ గురించి మాటల్లో చెప్పలేకపోతున్నారు.

సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్త పరుస్తున్నారు.

* చిట్టీ ఎంట్రీ అదిరిపోయింది. ఎంతో ఆసక్తిగా శంకర్ సినిమాకోసం ఎదురు చూసిన ప్రేక్షకుల్ని నిరాశ పరచలేదు. రజినీకాంత్, అక్షయ్ కుమార్ యాక్టింగ్ చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. రెహమాన్ అద్భుతమైన బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.

* రోబో సీక్వెన్స్ అదిరిపోయింది. శంకర్ సార్.. ఇది ఖచ్చితంగా హలీవుడ్ స్థాయి సినిమా. మీకోసం హాలీవుడ్ వెయిట్ చేస్తుంది. రజనీకాంత్, అమీజాక్సన్ సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.

* శంకర్ మరోసారి మాయ చేశారు. 2.0 చిత్రంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్ క్లైమాక్స్ ఇచ్చారు. ఇదో విజువల్ వండర్ మూవీ.

* క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకులకు ఇదో కొత్త అనుభూతి. బ్లాక్ బస్టర్ మూవీ అంటూ చెపుతున్నారు.

కేవలం సినీ అభిమానులు, ప్రేక్షకులే కాదు సినీ స్టార్స్ సైతం థియేటర్స్ వైపు పరుగులు పెడుతున్నారు. ఇక పూర్తి రివ్యూ మరికొద్ది సేపట్లో అందిస్తాం.