పాకిస్థాన్లో నటీమణులు హత్యకి గురికావడం ఆందోళన రేకెత్తిస్తుంది. ఇటీవల ఓ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, తాజాగా నటి మరియు సింగర్ రేష్మ భర్త చేతిలో దారుణ హత్యకి గురైంది. భర్తతో విభేదాలు ఉండటంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్ లోని హకిమాబాద్లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు.
ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తూటాలకు ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. అనంతరం నటి రేష్మ తీవ్ర రక్తస్రావంతో మృతిచెందారు.
నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఏడాదిలో ఇలా ఫీమేల్ ఆర్టిస్ట్లపై దాడి జరపడం పదిహేనోది కాగా, ఫిబ్రవరి 3న ఆర్టిస్ట్ సంబల్ ఓ ప్రైవేట్ పార్టీలో హత్యకు గురైన విషయం విదితమే. రేష్మ ఫేమస్ షో జోబల్ గొలునా అనే పాకిస్థాని డ్రామా షోతో బాగా పాపులర్