విక్రమ్ కుమారుడు ధృవ్ ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్తో హీరోగా పరిచయం కాబోతున్నారు. తొలుత ‘వర్మ’ టైటిల్తో ఈ రీమేక్ను రూపొందినా.. తర్వాత కొన్ని కారణాల వల్ల టైటిల్ను ‘ఆదిత్య వర్మ’గా మార్చారు. సినిమాను రీ షూట్ చేశారు. దర్శకుడు బాలా సినిమాను నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతల్ని గిరీశాయా తీసుకున్నారు.
ఈ సినిమా టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ధృవ్ తన నటనతో ఆకట్టుకున్నారు. టీజర్ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని గుర్తు చేసింది. అయితే తెలుగులో అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండను చూసిన కళ్లతో అక్కడ ధృవ్ విక్రమ్ను చూడటం కాస్త ఇబ్బందే అని చెప్పాలి. అయితే తమిళ ప్రేక్షకులకు మాత్రం ధృవ్ కొత్తగా అనిపిస్తున్నాడు.