ఆత్రేయకు కామ్రేడ్ విషెష్..

ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో మల్లేశం..ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాలు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. ముంబైలో కూర్చుని వెబ్ సీరీస్ చేస్తూ ఫెమస్ అయిన నవీన్ పోలిశెట్టి.. తెలుగులో హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో పరిచయమయ్యాడు. ఈ సినిమా పట్ల రోజు రోజుకు ప్రేక్షాదరణ తో పాటు సినీ ఆదరణ సైతం పెరుగుతుంది. తాజాగా ఈరోజు ఈ చిత్రాన్ని కామ్రేడ్ విజయ్ దేవరకొండ చూసాడు.

ఏఎంబి సినిమాస్ లో విజయ్ దేవరకొండ-అడవి శేష్-తరుణ్ భాస్కర్ తదితరులు కలిసి ప్రత్యేకంగా షో చూశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ హీరో నవీన్ పోలిశెట్టిఫై ప్రశంసల జల్లు కురిపించారు. నిజానికి ఈ ఇద్దరికీ ఎప్పటి నుంచో పరిచయముంది. ట్రైలర్ విడుదలైనప్పుడు నవీన్ విజయ్ దేవరకొండకు లింక్ ని మెసేజ్ చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడట.

దానికి బదులుగా ధైర్యం ఇస్తూ సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా సెలెబ్రేట్ చేసుకుందామని ఇక్కడి దాకా రావడమే ఒక అఛీవ్మెంట్ అని ధైర్యం చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ గుర్తు చేశాడు.ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రం తో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.