బన్నీ వీడియో రిలీజ్ చేసిన పూజా

అల్లు అర్జున్‌ సినిమా సెట్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చూశారు. ఎంతో ఉత్కంఠగా ఆయన మ్యాచ్‌ చూస్తుండగా తీసిన వీడియోను కథానాయిక పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. ee వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

బన్నీ , త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు.. ఇందులో బన్నీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. చిత్రానికి తమన్ మ్యూజిక్.