అనసూయ మళ్ళీ బుక్ అయ్యింది

అనసూయ జాతకం ఏమిటో కానీ ఆమె తరచూ విమర్శలు పాలౌతుంటుంది. ఆమె చేసిన పనులు కొందరికి తప్పుగా వెళుతుంటాయి. ఇలా తనను విమర్శించిన వారికి ఘాటుగా సమాధానం ఇస్తుంటుంది. కొన్నిసార్లు ఇంక ఈ సోషల్ మీడియా వద్దని అకౌంట్స్ డిలేట్ చేసిన సందర్భాలు వున్నాయి. తాజాగా మరోసారి విమర్శల పాలైయింది అనసూయ. ‘ఈరోజు నాకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె.

స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో కుటుంబంతో కలిసి సరదాగా విహారానికి వెళ్లింది అనసూయ తిరుగు ప్రయాణంలో భువనగిరిలోని హోటల్ వివేరాలో టిఫిన్ చేసేందుకు ఆగింది. అనసూయను చూడగానే హోటల్ యాజమాన్యం సెలెబ్రెటీ కావడంతో జెండా ఎగురవేయాలని కోరారు. దీంతో అనసూయ అంగీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. దీనికి గాను హోటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఫొటోలు వీడియోలను అనసూయ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఈ ఫొటో పోస్ట్ చేయడమే ఆలస్యం.. కొందరు నెటిజన్లు ‘జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో ఆ డ్రెస్ ఏంటీ?’ అంటూ కామెంట్లు చేశారు. తనపై వచ్చిన ఈ కామెంట్లను చదివి .. అనసూయ తీవ్ర మనస్థాపం చెందింది. ఈరోజు నాకు ‘ఈరోజు నాకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాదు’ అంటూ నిట్టూర్చింది.