నిఖిల్ కి వాయిదా సెంటిమెంట్

నిఖిల్‌ లేటెస్ట్ సినిమా ‘అర్జున్‌ సురవరం సంతోష్‌ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఈ సినిమాను మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ.. ఓ సంగతి చెప్పారు. ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనికి నిఖిల్ ఓ సెంటిమెంట్ చెప్పారు.

”కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలు కూడా ఇలానే వాయిదాలు పడ్డాయి. మంచి హిట్‌ అందుకున్నాయి. ఇది ఓ సెంటిమెంట్‌. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు చూస్తారు. మా చేతిలో ఓ మంచి సినిమా ఉంది. ఈ చిత్రానికి వంద శాతం బడ్జెట్‌ ఎక్కువైంది. అయినా సరే బాగా రావాలని నిర్మాతలు సపోర్ట్‌ చేశారు. ఎన్నికలు, రాజకీయాలు.. ఇలా ప్రస్తుతం చాలా వివాదాలు జరుగుతున్నాయి. అందుకే వీటికి దూరంగా మే 1న విడుదల చేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు.