అనుష్క కొత్త సినిమా ‘నిశ్శబ్దం’ షూటింగ్ ప్రారంభమైంది. అమెరికాలో ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్మీడియా వేదికగా షేర్ చేసింది.
ముందు నుంచి అనుకుంటున్నట్లే ఈ చిత్రానికి ‘సైలెన్స్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తెలుగులో ‘నిశ్శబ్దం’ అనే టైటిల్తో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇందులో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నారట. థ్రిల్లర్ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడసన్తోపాటు మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు.