సైలెన్స్ గా మొదలు పెట్టింది..

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపిన బొమ్మాలి అనుష్క..భాగమతి తర్వాత సినిమాలు చేయడం మానేసింది..అధికంగా బరువు పెరగడం..దానిని తగ్గించుకునే పనిలో ఉండడం తో ఏ సినిమా చేయకుండా గడిపింది. చాల లాంగ్ గ్యాప్ తర్వాత ‘సైలెన్స్’ అనే సినిమాకి సైన్ చేసింది.

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అమెరికా లో మే 24 న ప్రారంభమైంది. ఈ చిత్రంలో అనుష్క ఎన్నారై బిజినెస్ఉమెన్ పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షాలిని పాండే, అంజలి, సుబ్బరాజ్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మడిసెన్ కీలక పాత్రలు పోషించనున్నారు.