శిల్ప క‌ళా వేదిక‌లో అరవింద సక్సెస్ మీట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించడం తో చిత్ర యూనిట్ తో పాటు నందమూరి అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 11 న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ , మొదటి ఆట తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో ఈ విజయాన్ని అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ నెల 21న హైదరాబాద్ లోని శిల్ప క‌ళా వేదిక‌లో భారీ సక్సెస్ మీట్ ఏర్పటు చేస్తున్నారు. సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీ లో పూజా హగ్దే హీరోయిన్ గా నటించగా , సునీల్ కీలక పాత్రలో నటించాడు.