మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపి మలినేని డైరెక్షన్లో క్రాక్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే రమేష్ వర్మ డైరెక్షన్లో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఖిలాడీ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగాయి. ఇక ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ హీరో అర్జున్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్గా నటిస్తున్నారు.