బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భాంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి దుమ్ములేపారు. ఈ టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే చూపించడం తో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది.
కరోనా వలన చిత్ర షూటింగ్కు దాదాపు ఏడు నెలల పాటు బ్రేక్ పడగా..రీసెంట్ గా ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర హీరోయిన్ విషయంలో మొదటి నుంచి బాలయ్యకు కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మూవీ కోసం ముందు మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్ని ఫైనల్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోగా.. ఆ తరువాత సాయేషా సైగల్ లైన్లోకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం సాయేషా కూడా ఈ మూవీ నుంచి ఔట్ అవ్వగా.. ఆ స్థానంలో కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్యాల్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.