బిగ్ బాస్ రచ్చ….నాగ్ ఇంటి వద్ద టెన్షన్

4 రోజుల్లో బిగ్ బాస్ షో మొదలు కానున్న నేపధ్యంలో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన జూబ్లీహిల్స్ ఇంటిని విద్యార్థులు చుట్టుముట్టారు. కొద్దిరోజులుగా తెలుగు బిగ్ బాస్ షో చుట్టూ వివాదాలు అలుముకున్న సంగతి తెలిసిందే ఈ షోకి సంబందించిన వ్యక్తులు తమతో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా షో నిర్వాహకులపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు.

మరోపక్క ఈ షో వలన ఉపయోగం లేదని సామజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విద్యార్థి సంఘాలు తాజాగా ఆ షో హోస్ట్ చేయబోతున్న .జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 48లోని నాగార్జున ఇంటి ముందు ఆందోళన చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందుజాగ్రత్తగా నాగార్జున ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు.

షో హోస్ట్ నాగార్జున ఇంటితో పాటు బిగ్ బాస్ ఆఫీస్ ని కూడా ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రో 4 రోజుల్లో షో మొదలు కానున్న నేపథ్యంలో ఈ వివాదాలు ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కానీ హై కోర్ట్ మాత్రం ఈ షోకు ఊర‌ట‌నిచ్చింది. నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేయాల‌ని దాఖలైన పిటిష‌న్ ప‌రిశీలించిన కోర్ట్ అలాంటివేం చేయొద్ద‌ని ఆదేశించి, వారం రోజుల్లో కౌంట‌ర్ పిటిషన్ దాఖ‌లు చేయాల‌ని తీర్పునిచ్చింది.