బోయపాటి తల్లి కన్నుమూత..

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇంట్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి 7.22 గంటలకు మరణించారు. సీతారావమ్మ వయస్సు 80 సంవత్సరాలు.

గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామంలో మరణించారు. తల్లి మరణ వార్త వినగానే శ్రీను తన ఫ్యామిలీతో కలిసి పెదకాకాని చేరుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం శ్రీను బాలకృష్ణ తో ఓ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఏ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.