నటి జ్యోతిక మీద కేసు నమోదు !

ప్రముఖ నటుడు సూర్య భార్య, ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో తమిళనాట విడుదలైన ‘రాక్షసి’సినిమా వివాదాస్పదమైంది. ఇందులో ప్రభుత్వఉపాధ్యాయుల సమర్థతను నిర్లక్ష్యాన్ని బాగా ఫోకస్ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి పాత్రలో జ్యోతిక నటించింది. ఉపాధ్యాయులు సరిగా పాఠాలు చెప్పకుండా పుస్తకాలు చదువుతూ సెల్ ఫోన్లతో కాల గడుపుతుంటారని, అలాగే అక్కడి విద్యార్థులు సిగరెట్లు మందు తాగుతూ గొడవలు పడుతుంటారని ఈ సినిమాలో చూపారు.

అత్యధిక వేతనాలు తీసుకునే ఉపాధ్యాయులు విద్యార్థులపై సరిగా దృష్టిసారించకపోవడం వల్లనే వారు వైద్య విద్య లాంటి ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఈ సినిమా చూసిన వారికి భావన వచ్చేలా చిత్రీకరించారు. దీంతో తమను ఇంత తక్కువ చేసి చూపడం పట్ల తమిళనాడు ఉపాధ్యాయుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతే కాకా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీకే ఇళమారన్ తాజాగా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రాక్షసి చిత్రానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే పిల్లలు చదవలేకపోతున్నారనే సన్నివేశాలు చూపించారని దేశం నాశనానికి ఉపాధ్యాయులే కారణమనేలా సంభాషణలు సన్నివేశాలున్నాయని ఈ చిత్రాన్ని నిషేధించాలని కోరారు. నటి జ్యోతిక, అలాగే సినిమా యూనిట్ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.