9 గంటలపాటు రియా ను ఉక్కిరిబిక్కిరి చేశారట..

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. మరోపక్క సుశాంత్ ది హత్యే నని పలు వార్తలు వినిపిస్తుండడం తో అంత నిజమే కావొచ్చని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కేసును సిబిఐ కి అప్పగించింది.

రంగంలోకి దిగిన సిబిఐ కేసును క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం రోజు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని సుదీర్ఘంగా విచారించారు. ఏకంగా 9 గంటల పాటు రియాతో డైరెక్టుగా విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పలు ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ చుక్కలు చూపించింది. బ్యాంక్ అకౌంట్లు, ముంబైలో విలువైన ఆస్తులు, కంపెనీల ఏర్పాటు లాంటి అంశాలపై ఫోకస్ పెట్టి కీలక సమాచారాలు సేకరించింది. శుక్రవారం రోజు ఉదయం 11 గంటల 50 నిమిషాలకు మొదలైన ఈడీ విచారణ రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు సాగడం విశేషం.