చైతు – పరుశురాం మూవీ ఖరారు..

గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరుశురాం..ఈ సినిమా తర్వాత మరో సినిమా మొదలు పెట్టలేదు. ఈ సినిమాలో చేసిన విజయ్ మాత్రం మూడు , నాల్గు సినిమాలు చేసాడు. అయితే పరుశురాం గీత తర్వాత నాగ చైతన్య తో ఓ సినిమా అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏమైందో చైతు ను పక్కన పెట్టి వీరే హీరోలతో చేయాలనీ అనుకున్నాడు..కానీ వారెవరు ఓకే చెప్పకపోవడం తో మళ్లీ చైతుతో దగ్గరికే వచ్చి ప్రాజెక్ట్ ఓకే చేసాడు.

మొన్నటి వరకు ఈ కాంబో ఫై క్లారిటీ రాకపోయేసరికి ఓకే అవుతుందో కాదో అని అంత అనుకున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు అధికారికంగా చిత్ర యూనిట్ తెలిపారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అతి త్వరలోనే దీనికి సెట్స్ పైకి తీసుకొస్తారట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చైతు తన 19 వ సినిమా చేస్తున్నాడు.