చరణ్ మరో బాలయ్య అయ్యాడుగా..

బాలయ్య సినిమా వస్తుందంటే నవ్వుకోవడానికి చాలామంది థియేటర్స్ వెళ్లే వారు..ఎందుకంటే బాలయ్య సినిమాలో యాక్షన్ పార్ట్ ఆ రీతిలో ఉండేది. అప్పుడెప్పుడే ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమాలో బాలకృష్ణ తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, ఆయన పిలిస్తే కుర్చీ నడుచుకుంటూ వచ్చేయడం, కోడి పుంజుతో విలన్లను చంపేయించడం ఇవన్నీ కూడా ఇప్పటికి జనాలకు నవ్వు తెప్పిస్తుంటాయి. ఈ యాక్షన్ సన్నివేశాలపై ఇప్పటికీ సెటైర్లు వేస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలకు బాలయ్యను బ్రాండ్ అంబాసిడర్‌ను చేసేశారు.

కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అంబాసిడర్‌ చరణ్ కు దక్కుతుంది. ఎందుకంటే తాజాగా ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో వినయ విధేయ రామ చిత్రం చేసాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసినవారంతా ఈ సినిమా ఫైట్స్ గురించి ఓ రేంజ్ లో సైటైర్లు వేస్తున్నారు. ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ని మరిపిస్తున్నాయంటున్నారు. రామ్ చరణ్ విలన్ల తలకాయలు నరికితే అవి గాల్లోకి ఎగరడం, వాటిని గెద్దలు ఎత్తుకుపోవడం, వేగంగా వెళ్తోన్న ట్రైన్‌పై చరణ్ దర్జాగా నిలబడి రావడం, నాగుపాముతో వివేక్ ఒబెరాయ్ కాటు వేయించుకుంటే ఆ పాము చచ్చిపోవడం.. ఇలా చాలా సన్నివేశాలు నమ్మలేని విధంగా నవ్వు తెప్పించేలా ఉన్నాయని వారంతా చెప్పడమే కాదు ఆ వీడియోలను సోషల్ మీడియా లలో షేర్ చేస్తున్నారు. మొత్తం మీద చరణ్ బాలయ్య ను మించిపోయాడు.