‘RRR’ లో చరణ్ హీరో మాత్రమే కాదట..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య బ్యానర్ లో దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మితం అవుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని , ఫిబ్రవరి లో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది.

ఈ మూవీ లో రామ్ చరణ్ కేవలం హీరో మాత్రమే కాదట..ఈ సినిమాలో పెట్టుబడి పెడుతున్నారట. అది తనకు రావాల్సిన పారితోషికాన్నే ఇన్వెస్టిమెంట్ గా మార్చారని సమాచారం. ప్రస్తుతం చరణ్ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో `వినయ విధేయ రామ`లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది కూడా దానయ్య. వరుసగా రెండు సినిమాల పారితోషికాలు ఆర్ఆర్ఆర్ కి పెట్టుబడిగా చరణ్ ఇస్తున్నారట.

రంగస్థలం తర్వాత చరణ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచారట..ఈ నేపథ్యంలో దానయ్య ఒక్కో ప్రాజెక్టుకు 20 కోట్లకు డీల్ మాట్లాడుకున్నాడుట. అయితే ఆ డబ్బును చరణ్ తనకు ఇవ్వొద్దని అలాగే ఆర్ఆర్ఆర్ వచ్చే పారితోషికాన్ని కూడా సినిమాలోనే ఇన్వెస్ట్ చేయండని… సినిమా హిట్ అయితే వచ్చిన లాభాల్లో పర్సంటేజ్ తీసుకుంటానని చెప్పారట. దానికి దానయ్య కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ రెండు సినిమాల ఫై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం గ్యారెంటీ..అందుకే చరణ్ ఈ ప్లాన్ చేసాడని అంత మాట్లాడుకుంటున్నారు.