చరణ్ కు కథ చెప్పేందుకు సిద్దమైన వంశీ ..

సూపర్ స్టార్ మహేష్ బాబు తో వంశీ పైడిపల్లి మహర్షి అనే సూపర్ హిట్ ఫిలిం తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ కావడం తో మహేష్ తన 27 వ చిత్రాన్ని మళ్లీ వంశీకే ఇచ్చాడు. తీరా సెట్స్ పైకి వెళ్లబోతుందనే టైం లో వంశీ కథ ఫై అనుమానం వచ్చి పక్కకు పెట్టి..పరుశురాం కథ కు ఓకే చెప్పాడు. లాక్ డౌన్ తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుందని వినికిడి.

ఇదిలా ఉంటె ఇప్పుడు వంశీ తో ఓ సినిమా చేసేందుకు రామ్ చరణ్ సిద్ధం అవుతున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలయికలో ‘ఎవడు’ సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. కాగా ఇప్పుడు చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేసి ఉంచాడట వంశీ. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో వంశీ పైడిపల్లి సినిమాని సిద్ధం చేసాడని అంటున్నారు. త్వరలోనే చరణ్ ఈ కథ చెప్పబోతున్నాడట. మరి ఈ కథ చరణ్ కు నచ్చుతుందా లేదా నేది చూడాలి.