సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి చిరు మూవీ..

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే వేదాళం మూవీ తో పాటు లూసిఫర్ చిత్ర రీమేక్ లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌ లో వినాయక్ తో పాటు ఆకుల శివ, సాయి మాధవ్ బుర్రా మార్పులు చేసారు.

ఇప్పటికే చిరుకి పూర్తి స్క్రిప్ట్‌ కూడా వినిపించారట. మెగాస్టార్ కి కూడా చేసిన మార్పులు బాగా నచ్చాయని.. అందుకే స్క్రిప్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కాగా వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత ఈ సినిమాని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.