సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కేసీఆర్..

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి సినీ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఫ్యామిలీ తో కలిసి మల్టీఫ్లెక్సు థియేటర్ లో సినిమా చూడలేకపోతున్నారు.దీనికి కారణం టికెట్ ధర కాదు విశ్రాంతి సమయం లో పాప్ కార్న్ , వాటర్ బాటిల్ మిగతా వస్తువులపై వారు వేసే ధరలను చూసి సామాన్య జనాలు థియేటర్స్ కు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యం లో వాటికీ చెక్ పెడుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మై మూవీ.. మై ఫుడ్ పేరుతో మహారాష్ట్రలో నడిచిన ఉద్యమం నేపథ్యంలో.. మల్టీఫ్లెక్సుల్లోకి బయట పుడ్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు ఇదే పద్ధతి తెలంగాణలోనూ అమలు చేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. తాజాగా ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని మల్టీఫ్లెక్సుల్లో బయట నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లుగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటన సినిమా అభిమానులు , ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.