మహేష్ AMB సినిమాస్ నోటీస్ ఫై క్లారిటీ..

సూపర్ స్టార్ మహేష్ బాబు , ఏషియన్ సునీల్ సంయుక్తం గా హైదరాబాద్ లో AMB సినిమాస్ పేరిట సరికొత్త మల్టీఫ్లెక్స్ థియేటర్ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం ఈ థియేటర్ గ్రాండ్ గా ఓపెన్ అయ్యింది. అయితే తాజాగా జీఎస్టీ అధికారులు టికెట్స్ ధర విషయంలో యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారనే వార్తలు బయటకు రావడం తో అభిమానులు ఖంగారు పడ్డారు. కాగా ఈ నోటీసు ఫై సునీల్ స్పందించారు.

జీఎస్టీ తగ్గింపు విషయంలో ఏ నోటీసూ ఇవ్వలేదని తెలిపారు. అధికారులు థియేటర్ కు వచ్చినమాట వాస్తవమే అని, అయితే తాము జీఎస్టీ తగ్గించే టికెట్ లు విక్రయిస్తున్నామని, ఆ రికార్డులే అడిగారని, వాటిని మీము చూపించినట్లు తెలిపారు. ఒకవేళ ఏదయినా నోటీసు ఇచ్చినా, ఎంత కట్టాలో చెప్పినా, వెంటనే కట్టడానికి తాము సిద్దంగా వున్నామని, నోటీసులు ఇచ్చారన్న వార్తలు తెలిసి, అధికారులు కూడా ఆశ్చర్యపోయారని సునీల్ చెప్పుకొచ్చాడు. సునీల్ క్లారిటీ తో అంత హమ్మయ్య అనుకున్నారు. పేరుకు మహేష్ కానీ ఈ వ్యవహారాలన్నీ నమ్రత చూసుకుంటుంది.

ప్రస్తుతం మహేష్ తన సినిమాలతో బిజీ గా ఉన్న , ఆయన వ్యాపార ఇంటి విషయాలన్నీ దగ్గరుండి చూసుకునేది నమత్రతనే.