బిగ్ బి ఫ్యామిలీకి కరోనా

ముంబై మహానగరంలో మొదటి నుండి కూడా కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలాదిమంది దీనిబారిన పడగ..తాజాగా బిగ్ బి ఫామిలీ సైతం దీనిబారిన పడ్డారు. అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కూ కరోనాసోకింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వెల్లడించారు.

‘‘నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి వర్గాలు అధికారులకు సమాచారం అందించాయి. కుటుంబానికి, స్టాఫ్‌కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్టుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. గత 10 రోజులుగా నాతో దగ్గరగా మెలిగిన వారు ఎవరికి వారుగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను.’’ అని బిగ్ బి ట్వీట్ చేశారు.

ఆ తర్వాత అభిషేక్ ‘మా తండ్రి, నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మా ఇద్దరికీ కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరాం. సంబంధిత అధికారులందరికీ ఈ సమాచారాన్ని అందించాం. అలాగే మా కుటుంబ సభ్యులు, స్టాఫ్‌కు సైతం కరోనా పరీక్షలు చేయించాం. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని అభిషేక్ ట్వీట్ చేసాడు. కాగా, అమితాబ్ ఫ్యామిలీలో మరి కొందరికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న తోటి నటి నటులు , అభిమానులు త్వరగా వీరు కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నారు.