రాజ్ తరుణ్ ఫై దిల్ రాజు పగ తీర్చుకున్నాడా..?

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్..ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో చేసిన లవర్ సినిమాపై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు. అలా ఎలా ఫేమ్ అనిల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా చిత్ర ప్రమోషన్ లలో పాల్గొన్న దిల్ రాజు రాజ్ తరుణ్ ఫై పలు ఆసక్తికర వ్యాఖ్యలు తెలియజేసి రాజ్ తరుణ్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు. గతం లో రాజ్ తరుణ్ తో దిల్ రాజు సినిమా చేయాలనుకున్నాడు. కానీ రాజ్ తరుణ్ కొన్ని కండిషన్లు పెట్టడం తో తరుణ్ ను పక్కకు పెట్టాడనే వార్తలు అప్పట్లో వినిపించాయి.

తాజాగా దిల్ రాజు మాట్లాడుతూ.. తరుణ్ మార్కెట్ ఇప్పుడు బాగా డౌన్ లో ఉందని మహా అయితే 4 కోట్లకు మించి బడ్జెట్ పెడితే అది రిస్క్ అవుతుందని అలాంటిది తాను దీని మీద 8 కోట్లు పెట్టడం కేవలం మా బ్యానర్ వేల్యూ కోసమే అని చెప్పి షాక్ ఇచ్చాడు. రాజ్ తరుణ్ కు ఇదే ఎక్కువ బడ్జెట్ అని చెప్పడం కొసమెరుపు. తన బ్యానర్ లో ఎప్పటి నుంచో చేయాలని రాజ్ తరుణ్ అడిగాడని ఇప్పటికి కుదిరిందని చెప్పి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్న హర్షిత్ ఐదు పాటలకు వేర్వేరు సంగీత దర్శకులను పెడదాం అన్నప్పుడు కూడా రాజ్ తరుణ్ సినిమాకు అవసరమా అని అడిగారట.

మొత్తానికి దిల్ రాజు ఉద్దేశం ఏదైనా అది రాజ్ తరుణ్ కు ప్రతికూలంగానే మారింది. దానికి తోడు పదే పదే నేనే టెన్షన్ గా ఉన్నాను అని దిల్ రాజు చెప్పుకోవడం చూస్తే లవర్ మీద నమ్మకం తగ్గిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఓకే ఎత్తు అయితే రాజ్ తరుణ్ పక్కన పెద్ద హీరోయిన్లు చేయరని అతనికి వెతికి సెట్ చేయటం పెద్ద సవాల్ అని మరో బాంబు పేల్చాడు. ఈ మాటలు విన్న వారంతా మొత్తానికి రాజ్ తరుణ్ ఫై దిల్ రాజు పగ తీర్చుకున్నాడని అంత మాట్లాడుకుంటున్నారు.